నా ప్రియ మిత్రుడి మరణం చాలా బాధ కలిగించింది: ప్రధాని మోడీ

by Malleboina Mahesh |   (  Updated:2025-10-15 10:26:25  IST  )

కెన్యా మాజీ ప్రధాన మంత్రి రైలా ఒడింగా ఈ రోజు ఉదయం అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆయన మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

నా ప్రియ మిత్రుడి మరణం చాలా బాధ కలిగించింది: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: కెన్యా మాజీ ప్రధాన మంత్రి రైలా ఒడింగా (Raila Odinga) ఈ రోజు ఉదయం అనారోగ్యం కారణంగా కన్నుమూశారు (passed away). ఆయన మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అందులో "నా ప్రియ మిత్రుడు, కెన్యా మాజీ ప్రధాన మంత్రి రైలా ఒడింగా మరణం నాకు చాలా బాధ కలిగించింది. ఆయన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు, భారతదేశానికి ఎంతో ఇష్టమైన స్నేహితుడు. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయనను దగ్గరగా తెలుసుకునే అదృష్టం నాకు లభించింది. నాటి నుంచి మా అనుబంధం సంవత్సరాలుగా కొనసాగింది.

భారతదేశం, మన సంస్కృతి, విలువలు, ప్రాచీన జ్ఞానం పట్ల ఆయనకు ప్రత్యేక అభిమానం ఉంది. భారతదేశం-కెన్యా సంబంధాలను బలోపేతం చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలలో ఇది ప్రతిబింబిస్తుంది. తన కుమార్తె ఆరోగ్యంపై వాటి సానుకూల ప్రభావాన్ని చూసిన ఆయన ఆయుర్వేదం, భారతదేశ సాంప్రదాయ వైద్య విధానాలను ప్రత్యేకంగా ఆరాధించారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబానికి, స్నేహితులకు, కెన్యా ప్రజలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను." అని ప్రధాని మోడీ రాసుకొచ్చారు.

Read More: కేరళలో కెన్యా మాజీ ప్రధాని మృతి.. అసలేం జరిగిందంటే?

Next Story